భారతదేశం, ఆగస్టు 26 -- త్వరలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండగా. మరోవైపు ఈసీ కూడా ఏర్పాట్లు చేసే పనిలో పడింది. అయితే ఈ ఎన్నికలను ఇప్పట్నుంచే అత్యంత సీరియస్ గా తీసుకొని క్షేత్రస్థాయిలో పని చేయాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్.. పార్టీ నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనడానికి బలమైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జగన్ వ్యాఖ్యానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని.. అంగుళం మేర కూడా రాజీ పడకుండా పోరాడాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు.

పార్టీ ముఖ్య నేతల స్థాయి నుంచి నియోజకవర్గాల ఇన్‌చార్జుల వరకు మంగళవారం నిర్వహించిన కీలక సమావేశంలో వైఎస్...