భారతదేశం, మార్చి 26 -- సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని.. ఆ తర్వాత చంద్రబాబుకు రోజూ సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు. అద్దంకి నియోజకవర్గం నేతలతో బుధవారం సమావేశమైన జగన్.. ఈ సందర్భంగా మాట్లాడారు.

ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కూటమి పాలనలో ఇప్పటికే రెండేళ్లు పూర్తి అయ్యాయని చెప్పారు. చంద్రబాబుకు మిగిలింది మరో మూడేళ్లు మాత్రమేనని. ఏడాదిన్నర తర్వాత తాను పాదయాత్ర చేపడతానని పేర్కొన్నారు. పార్టీ మొత్తం రంగంలోకి దిగుతుందని. చంద్రబాబుకు భయపడే రోజులు పోయాయన్నారు.

"ఇప్పటికే రెండేళ్లు గడిచాయి. ఇంకా మిగిలింది మూడేళ్లు. అందులో చివరి ఏడాదిన్నర నేను పాదయాత్రలో ఉంటాను. దాంతో మొత్తం పార్టీ ప్రజల కోసం నేరుగా రంగంలోకి దిగుతుంది. ...