భారతదేశం, ఏప్రిల్ 1 -- సీఎం చంద్రబాబు వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాజధాని అమరావతి పేరిట ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని అనే అంశం పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిందని. కేంద్రం పాత్ర లేనేలేదని స్పష్టం చేశారు. అయినా సరే చంద్రబాబు అమరావతి పేరిట డ్రామా నడిపిస్తున్నారని విమర్శించారు.

"చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి లేదు. పరిపాలన అంటే ఆయన దృష్టిలో దోపిడీ, అవినీతి మాత్రమే. చంద్రబాబు సీఎంగా ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టం. అమరావతి చట్టబద్ధత తీర్మానం విషయంలోనూ డ్రామాలు ఆడారు. తాను చేసే దోపిడీనుంచి డైవర్ట్‌ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు " అని వైఎస్ జగన్ కామెంట్స్ చేశారు.

ఇవాళ మీడియాతో మాట్లాడిన జగన్.. అమరావతిలో ఆర్గనైజ్డ్‌ కరప్షన్‌ జరుగుతోందని చెప్పారు. 2018లో ఎవరు ఏ పనులు చేశారో.. 2024 తర్వా...