భారతదేశం, మే 6 -- Yellamma: తొలి సినిమా 'బలగం'తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఎల్దండి. ఆయన రెండో ప్రయత్నంగా వస్తున్న 'ఎల్లమ్మ' సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలను భారీగా పెంచేసింది. గ్రామీణ నేపథ్యంతో కూడిన ఒక ఎమోషనల్ అండ్ పవర్ ఫుల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు తన క్రేజీ కాస్టింగ్‌తో ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది.

ఈ ఎల్లమ్మ మూవీలో హీరోగా ఎవరు నటిస్తారనే విషయంలో గత కొద్ది రోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. నేచురల్ స్టార్ నాని, నితిన్ వంటి హీరోలు ఈ ప్రాజెక్ట్ రేసులో ఉన్నప్పటికీ, చివరికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) కథానాయకుడిగా ఎంపికై అందరినీ షాక్‌కు గురిచేశారు.

కేవలం సంగీతానికే పరిమితం కాకుండా ఇప్పుడు నటుడిగా డీఎస్‌పీ అదృష్టాన్ని పరీక్షించుకోబోత...