భారతదేశం, మే 28 -- Ambati Rayudu Advice To Yashasvi Jaiswal To Leave RR IPL Team: భారత టెస్ట్ క్రికెట్‌లో బెస్ట్ ఓపెనర్‌గా ఎదిగిన ఆటగాడు యశస్వి జైస్వాల్. ఇప్పటివరకు టీమిండియా తరఫున 55 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతడి సొంతం. ఐపీఎల్‌లో ఇది అతడికి ఏడో సీజన్. మరోవైపు వైభవ్ సూర్యవంశీ కేవలం టీ20 ఫార్మాట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఒక కొత్త మోన్‌స్టర్.

టీమిండియాలోకి ఇంకా అడుగుపెట్టని సూర్యవంశీకి ఇది కేవలం రెండో ఐపీఎల్ సీజన్ మాత్రమే. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ ఇద్దరిలో యశస్వి కంటే సూర్యవంశీనే ఎక్కువ పాపులారిటీ, పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

జైస్వాల్ 15 మ్యాచ్‌ల్లో 426 పరుగులు చేసి పర్వాలేదనిపించినా, వైభవ్ సూర్యవంశీ ఏకంగా 680కి పైగా పరుగులు సాధించి రికార్డులు తిరగరాస్తున్నాడు. ఏకంగా విరాట్ ...