భారతదేశం, ఏప్రిల్ 23 -- ఇల్లు ఎంత పెద్దదో కాదు. అందులో ఉన్న పుస్తకాలే ఆ ఇంటి విలువను నిర్ణయిస్తాయి. సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కాదు. ఎంత విజ్ఞానంతో ముందుకు సాగుతోందో అదే అసలు ప్రమాణం. ఈ వాక్యాలు కేవలం భావోద్వేగపు మాటలు కావు. నాగరిక సమాజ నిర్మాణానికి పునాది అయిన శాశ్వత సత్యాలు. ప్రపంచ పుస్తక దినోత్సవం మనకు గుర్తు చేసే గొప్ప సందేశం ఇదే.పుస్తకం తెరిస్తే మనసు తెరుచుకుంటుంది. జ్ఞానం వెలుగుతుంది. భవిష్యత్తు మెరుగవుతుంది.

ప్రపంచ నాగరికతను ముందుకు నడిపించిన అద్భుత సాధనం ఏదైనా ఉందంటే అది పుస్తకం. మనిషి ఆలోచనకు ఆకారం ఇచ్చింది, అనుభవాలకు అక్షరరూపం ఇచ్చింది, తరతరాల జ్ఞానాన్ని తరలించింది పుస్తకమే. శతాబ్దాలు మారినా, సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, పుస్తకానికి ఉన్న స్థానం మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే పుస్తకం కేవలం కాగితపు అట్ట కా...