భారతదేశం, జూలై 4 -- ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రాలో ఒక మహిళ తన భర్తను కిరాతకంగా హత్య చేసి, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లోని బాత్‌రూమ్ ఫ్లోర్ కింద పాతిపెట్టి సిమెంట్‌తో కప్పేసింది. అనంతరం భర్త కనిపించడం లేదంటూ 45 రోజుల పాటు నాటకాలు ఆడింది! చివరికి పోలీసులకు చిక్కింది.

ఆగ్రాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. దహతోరా ప్రాంతంలో నివసించే 44 ఏళ్ల సురేంద్ర శర్మ, ఆయన భార్య రూబీ శర్మలకు 16 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేంద్ర శర్మకు మద్యపానం అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మే నెలలో ఒకరోజు రూబీ పక్కా ప్లాన్ ప్రకారం తన ఇద్దరు కుమార్తెలను సురేంద్ర పెద్దన్నయ్య ఇంటికి పంపించేసింది. ఆ తర్వాత భర్తకు ఇష్టమైన ఖీర్ (పరమాన్నం)లో నిద్రమాత్రలు కలిపి తినిపించి...