భారతదేశం, మార్చి 11 -- గ్రేటర్ వరంగల్‌‌‌‌‌‌‌‌ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్ డ్రైనేజీ(యూడీఎస్​) ప్రాజెక్ట్ త్వరగానే పట్టాలెక్కబోతుంది. ఇటీవలనేప్రభుత్వం రూ.5,257.20 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరితగతిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి. పనులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి.

వరంగల్ అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టును 4 ప్యాకేజీలు, 9 జోన్లు, 13 సబ్‌‌‌‌‌‌‌‌జోన్లుగా విభజించి చేపట్టనున్నారు. దశల వారీగా చేపట్టే ఈ పనులు.. వచ్చే రెండు, మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు గ్రేటర్ వరంగల్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో ఈ పనులు చేపడుతారు. రాజస్థాన్‍కు చెందిన ఎన్‍.కే.బిల్డ్​కాన్‍ ప్రైవేట్‍ లిమిటెడ...