భారతదేశం, సెప్టెంబర్ 19 -- ఉత్తర తెలంగాణ ప్రజలు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న వరంగల్ విమానాశ్రయ కల నెరవేరే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కావలసిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి.. ఆ స్థలాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి అధికారికంగా అందజేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. శనివారం సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని పంచుకున్న ఆయన... నిర్మించబోయే కొత్త విమానాశ్రయానికి ఏ పేరు పెడితే బాగుంటుందో సూచించాలని ప్రజలను కోరారు.

గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన ఎయిర్‌పోర్ట్‌ను సాకారం చేయడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. ఆ పార్టీ నాయకులు కేవలం తమ కుటుంబ ...