భారతదేశం, సెప్టెంబర్ 13 -- Vizianagaram Road Accident : విజయనగరం జిల్లా బుర్జ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక లారీ, ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మానాపురం వైపు నుంచి వస్తున్న మార్గంలో ఈ ప్రమాదం జరిగింది" అని బొబ్బిలి డీఎస్పీ ఆర్‌. గోవిందరావు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదం జరగడానికి గల కారణాలేమిటో తెలుసుకునేందుకు పోలీసులు సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను, స్థానికుల ప్రకటనలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాడంగి మండలం గజరాయుని వలస గ్ర...