భారతదేశం, ఆగస్టు 24 -- మన శరీరంలో ఎముకల బలం పెరగడానికి, కాల్షియం సరిగ్గా అబ్సార్బ్ అవ్వడానికి, రోగనిరోధక శక్తి సక్రమంగా పనిచేయడానికి విటమిన్ డీ అత్యంత కీలక. సూర్యకాంతి చర్మంపై పడినప్పుడు శరీరం స్వయంగా విటమిన్ డీని తయారు చేసుకుంటుంది. అయినప్పటికీ, చాలా మందిలో దీని లోపం సాధారణంగా కనిపిస్తుండటంతో వైద్యులు సప్లిమెంట్లను ఎక్కువగా సిఫార్సు చేస్తుంటారు. అయితే కేవలం సప్లిమెంట్లు వేసుకోవడం మాత్రమే సరిపోదు.. వాటిని ఎప్పుడు, ఎలా తీసుకోవాలనే దానిపైనే మీ శరీరం వాటిని ఎంతవరకు గ్రహిస్తుంది అనేది ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా?

దిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్​లో శిక్షణ పొందిన జనరల్ ఫిజీషియన్, న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ విటమిన్ డీ సప్లిమెంట్ల నుంచి గరిష్ట ప్రయోజనాలను పొందే అత్యుత్తమ మార్గాలను వివరించారు. ఆగస్టు 20న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస...