భారతదేశం, సెప్టెంబర్ 8 -- Vishwanath and Sons OTT: కోలీవుడ్ వర్సటైల్ స్టార్ సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath & Sons). బాక్సాఫీస్ దగ్గర రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

తమిళ, తెలుగు చిత్రసీమల్లో భారీ క్రేజ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ మమితా బైజు ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ ఫ్యామిలీ డ్రామా సెప్టెంబర్ 11న ఓటీటీలోకి రాబోతుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్...