భారతదేశం, జూన్ 29 -- Visakhapatnam International Airport : విశాఖపట్నం ప్రాంత పౌర విమానయాన రంగంలో చారిత్రాత్మక మార్పునకు ముహూర్తం ఖరారైంది. జులై 8వ తేదీ నుంచి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ పౌర విమాన (సివిలియన్) రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఆ తేదీ నుంచి వాణిజ్య విమాన సర్వీసులన్నీ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' నుండి ప్రారంభం కానున్నాయి.

ప్రస్తుతం విశాఖ నగరంలో ఉన్న విమానాశ్రయం పూర్తిగా భారత నావికాదళం (ఇండియన్ నేవీ) ఆధీనంలో ఉంది. జులై 8 నుంచి ఇక్కడ పౌర విమానాల నిర్వహణను నిలిపివేసి, గ్రీన్‌ఫీల్డ్ భోగాపురం విమానాశ్రయాన్ని ఈ ప్రాంత ఏకైక వాణిజ్య విమానయాన గేట్‌వేగా మారుస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా పరిపాలనా యంత్రాంగ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

పబ్లిక్-ప్రైవే...