భారతదేశం, మార్చి 1 -- విరోష్ వెడ్డింగ్ ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను రష్మిక మందన్న ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కలిసి కాసేపు ముచ్చటించారు.

రష్మిక మందన్నకు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి సంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టి, కానుక ఇచ్చారు. ముఖ్యమంత్రి దంపతులు రష్మికను దీవించారు. విజయ్, రష్మిక రిసెప్షన్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు ఆహ్వానం అందాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని రష్మిక కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్...