భారతదేశం, మార్చి 8 -- టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహ వేడుకలు ముగిసినా, వాటికి సంబంధించిన ముచ్చట్లు మాత్రం ఇంకా నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి.

ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత దేశవ్యాప్తంగా స్వీట్స్ పంపిణీ చేసి, ఆలయాల్లో అన్నదానాలు నిర్వహించి ఈ జంట తమ ఉదారతను చాటుకుంది. అయితే, తాజాగా ఒక చిన్నారి అభిమాని అడిగిన ప్రశ్న ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

విజయ్ దేవరకొండకు వీరాభిమాని అయిన ఒక చిన్నారి.. "విజయ్ దేవరకొండ, రష్మికకు పెళ్లి అయింది కదా. లడ్డూలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. మనం కూడా ఫ్యాన్సే కదా. నేను కూడా నీ అభిమానినే కదా.. మరి నన్ను ఎందుకు పెళ్లికి పిలవలేదు? మమ్మల్ని మర్చిపోయారా? ఈ వీడియో వారికి షేర్ చేయండి" అంటూ అమాయకంగా ప్రశ్...