భారతదేశం, జూలై 12 -- Vijayawada Railway Station Sleeping Pods : రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక సేవలను అందించే దిశగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ కీలక అడుగు వేసింది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో సరికొత్త 'స్లీపింగ్ పాడ్స్' (Sleeping Pods) వసతిని శనివారం ప్రారంభించారు. సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారు, కనెక్టింగ్ రైళ్ల కోసం వేచి చూసే వారు, రాత్రి వేళల్లో స్టేషన్‌లో గడపాల్సిన భక్తులు, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.

స్టేషన్ వెలుపలికి వెళ్లకుండానే, సురక్షితమైన వాతావరణంలో, అత్యంత తక్కువ ఖర్చుతో విశ్రాంతి తీసుకునేందుకు రైల్వే శాఖ ఈ ఆధునిక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

విజయవాడ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 1పై ఈ స్లీపింగ్ పాడ్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికుల వ్యక్తిగత గోప్యతకు, భ...