భారతదేశం, ఆగస్టు 15 -- Trisha Attends CM Vijay Independence Day Celebrations: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు మిన్నుముట్టాయి. తమిళనాడులో ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకున్న 'తమిళగ వెట్రి కళగం' (TVK) ప్రభుత్వం నిర్వహిస్తున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవం ఇది కావడం విశేషం.

చెన్నైలోని చారిత్రాత్మక సెంట్ జార్జ్ కోట (సచివాలయం) ప్రాంగణంలో శనివారం (ఆగస్ట్ 15) ఉదయం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ విజయ్ తొలిసారిగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సంగీత విభావరి, పోలీసు బలగాల మార్చ్...