భారతదేశం, మే 9 -- Vijay Trisha: తమిళ సినీ రంగంలో దళపతి విజయ్, త్రిషల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి వ్యక్తిగత జీవితాల గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. తాజాగా ఈ పుకార్లపై బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ రాఖీ సావంత్ తనదైన శైలిలో స్పందించి, కొత్త చర్చకు తెరలేపింది.

తాజాగా ఫిల్మీమంత్రతో మాట్లాడిన రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. "విజయ్, త్రిష త్వరగా పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. వారి మెహందీ వేడుకకు నేను తప్పకుండా హాజరవుతా" అని రాఖీ తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు రాఖీ వ్యాఖ్యలపై భిన్నంగా స్పందిస్తున్నారు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సాధించిన విజయాన్ని రాఖీ సావంత్ ప్రశంసించి...