భారతదేశం, ఏప్రిల్ 20 -- Vijay Sethupathi: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్, 'పోకిరి' వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన పూరీ జగన్నాథ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 26 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో సంచలనాలు సృష్టించిన పూరీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి.. పూరీపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

సినిమా రంగంలో 26 ఏళ్లు పూర్తి చేసుకోవడం అనేది కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదని.. అది ధైర్యం, నమ్మకం, నిర్భయమైన గొంతుకతో నిర్మించుకున్న ఒక 'లెగసీ' అని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.

"ప్రియమైన పూరీ సార్.. మీతో కలిసి వర్క్ చేయడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నటీనటులను నమ్మి, వారి కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకువచ్చి నటనను ర...