భారతదేశం, మార్చి 1 -- టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయపూర్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారు జంటగా నటిస్తున్న పీరియడ్ డ్రామా 'రణబాలి' నుంచి మూవీ టీమ్ ఒక కొత్త పోస్టర్ను విడుదల చేసింది. అయితే ఈ పోస్టర్లో వారి ఆహార్యం, కూర్చున్న విధానం 'వింతగా' ఉందంటూ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దీనిపై తాజాగా డైరెక్టర్ వివరణ ఇచ్చాడు. ఓ సుదీర్ఘ పోస్ట్ చేశాడు.
ఈ విమర్శలపై రణబాలి మూవీ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ స్పందిస్తూ.. ఇది కేవలం ఒక పోస్టర్ మాత్రమే కాదని, ఒక కాలానికి ప్రతిబింబమని పేర్కొన్నాడు. 'రణబాలి' కథ 1854, 1878 కాలాల మధ్య జరుగుతుంది.
సహజత్వం కోసమే ఇలా చేసినట్లు రాహుల్ వివరించాడు. "పాత కాలం నాటి ఫోటోలను గమనిస్తే మన తాతముత్తాతలు కెమెరా ముందు చాలా సహజంగా ఉండేవారు. కృత్రిమమైన నవ్వులు, పోజులు ఉండ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.