భారతదేశం, మార్చి 1 -- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. విరోష్ జోడీ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఆ వెంటనే ఢిల్లీలో ప్రధాన మంత్రి మోడీని కలిసేందుకు విరోష్ వెళ్లారు. ప్రధానిని తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు ఆహ్వానించారు. ఆ తర్వాత హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు.

హైదరాబాద్ కు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న విమానంలో వచ్చారు. అయితే వీళ్లు ఎకానమీ క్లాస్ లో ప్రయాణించడం విశేషం. విరోష్ జోడీని ప్లైట్ లో చూడగనే ప్రయాణికులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో రష్మిక, విజయ్ విమానంలో ఉన్నట్లు కనిపించింది. రష్మిక సంతోషంగా నవ్వుతూ విమానంలోని ప్రయాణికులకు హాయ్ చ...