భారతదేశం, మార్చి 1 -- ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గ్రాండ్ గా జరిగింది. వివాహ బంధంతో ఈ లవ్ బర్డ్స్ ఒక్కటయ్యారు. తమ పెళ్లి నేపథ్యంలో ఫ్యాన్స్ కు స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వాలని విరోష్ జోడీ నిర్ణయించుకుంది. అందుకే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని అభిమానులకు ఇవాళ (మార్చి 1) స్వీట్లు పంచనున్నారు. కొన్ని గుళ్లలో అన్నదానం చేయనున్నారు.

తమ పెళ్లి కానుకగా అభిమానులకు స్వీట్లు పంపించనున్నట్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రకటించారు.

''ఈ దేశంలోని ప్రజలు ఎల్లప్పుడూ మా ప్రయాణంలో, ప్రేమలో భాగమయ్యారు. మా పెళ్లిని మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇండియాలో ప్రతిదాన్ని స్వీట్లు, ఆహారంతో సెలబ్రేట్ చేసుకుంటారు'' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో విరోష్ రాసుకొచ్చింది.

''మా జీవితంలోని...