భారతదేశం, ఆగస్టు 9 -- Vijay Deverakonda: తెలంగాణ వ్యాప్తంగా ఆషాడ బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులోనూ హైదరాబాద్ లో ఆ సందడే వేరే లెవల్ లో ఉంటుంది. ఈ రోజు (ఆగస్టు 9) పాతబస్తీలోని చరిత్రాత్మక లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు భక్తులు వేలాదిగా పోటెత్తారు. ఈ పావన పర్వదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయ ప్రాంగణానికి చేరుకున్న విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగాకు ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. వీళ్లు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. తమ కుటుంబ సభ్యులు, అభిమానులు క్షేమంగా ఉండాలని, రాబోయే సినీ ప్రాజెక్టులు విజయవంతం కావాలన...