భారతదేశం, మే 12 -- Writer Manu Joseph Slams Vijay CM Speech On Poverty: చెన్నై వేదికగా ఆదివారం (మే 10) నాడు తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వేలాది మంది అభిమానులు, రాజకీయ ఉద్దండుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో దళపతి విజయ్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ చేసిన తొలి ప్రసంగం అక్కడ ఉన్నవారందరినీ కదిలించింది. ముఖ్యంగా హీరోయిన్ త్రిష కృష్ణన్, విజయ్ మాటలు వింటూ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే, విజయ్ తన ప్రసంగంలో తన గతాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. "నాకు పేదరికం అంటే ఏంటో తెలుసు.. ఆకలి విలువ బాగా తెలుసు. నేను ఒక సామాన్య అసిస్టెంట్ డైరెక్టర్ కొడుకును. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను. నా వెను...