భారతదేశం, ఆగస్టు 28 -- Veligonda Project Relief Package : పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఇళ్లు, ఆస్తులు, భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కటాఫ్ తేదీ ముగిసినప్పటికీ, అర్హత కలిగిన యువతకు ఎక్స్ గ్రేషియా అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గెజిట్ నోటిఫికేషన్, సోషియో ఎకనామిక్ సర్వేలలో పేర్లు నమోదు కాని అర్హులైన నిర్వాసితులందరికీ సంపూర్ణ న్యాయం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సాధారణంగా ప్రాజెక్టు అవార్డు పాస్ కాని వారికి పరిహారం అందడం కష్టం, కానీ అలాంటి యువతకు కూడా ఆర్థిక సాయం అందేలా చూడాలని అధికారులకు మార్గదర్శనం చేశారు.

ముఖ్యమంత్రి ప్రతిపాదించిన మానవతా దృక్పథ...