భారతదేశం, మే 30 -- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఆడించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 2026 సీజన్‌లో పరుగుల వరద పారించి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్ దక్కింది. రాబోయే ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ కోసం ప్రకటించిన టీమిండియా 30 మంది ప్లేయ్ల ప్రాబబుల్స్ లిస్ట్ లో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది.

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోశాడు. 16 మ్యాచ్‌లలోనే 776 పరుగులు సాధించాడు. దీంతో అతణ్ని టీమిండియాాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కుర్రాడి ప్రదర్శనను సెలక్టర్లు సీరియస్‌గా పరిగణించి, ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లో చోటు కల్పించారు.

2026 ఆసియా క్రీడల కోసం ప్రాబబుల్స్ కు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర నెలకొల్పే అవకాశముంది. ఆ ఆ...