భారతదేశం, జూన్ 15 -- Vaibhav Sooryavanshi: ఇండియా ఎ - శ్రీలంక ఎ మధ్య సోమవారం (జూన్ 15) జరిగిన మ్యాచ్ లో ఊహించని హైడ్రామా నడిచింది. ఒక అద్భుతమైన క్రికెట్ మ్యాచ్ గా ముగియాల్సిన ఈ కాంటెస్ట్.. చివరకు ఆటగాళ్ల మధ్య గొడవలు, అంపైర్లతో వాదనలతో ముగిసింది. ఈ వివాదాస్పద గెలుపుతో శ్రీలంక ఎ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కి వెళ్లడమే కాకుండా ఫైనల్ బెర్తుకు మరింత దగ్గరైంది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఎ నిర్ణీత ఓవర్లలో 265 రన్స్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ కు దిగిన శ్రీలంక ఎ కూడా కరెక్ట్ గా 265 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. అయితే ఆ సమయంలో వెలుతురు మందగించడంతో అసలు సూపర్ ఓవర్ నిర్వహించాలా వద్దా అనే గందరగోళం నెలకొంది.

దీంతో ఇండియా ఎ కెప్టెన్ తిలక్ వర్మ (Tilak Varma) వెంటనే ఫీల్డ్ అంపైర్ల దగ్గరకు వెళ్లి తీవ్రంగా వాదించాడు. సూపర్ ఓవర్ ఖచ...