భారతదేశం, మార్చి 5 -- బ్రేకింగ్ న్యూస్.. ఒక వారం ముందుగానే థియేటర్లలో ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ ను ప్రీ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ మార్చి 26న కాకుండా ఓ వారం ముందుగా అంటే మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ ను థియేటర్లకు తెస్తున్నారు. టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్ నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ మారింది. ఈ మూవీ మార్చి 26, 2026న కాదు మార్చి 19, 2026న రిలీజ్ కానుంది. ఈ మేరకు ఇవాళ (మార్చి 5) మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ మెంట్ పోస్టు పెట్టింది.

''ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత. బాక్సాఫీస్ దగ్గర మాసివ్ సెలబ్రేషన్స్ కోసం మన ఉస్తాద్ ఒక వారం ముందే వస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా...