భారతదేశం, మార్చి 25 -- పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ రన్ చాలా స్లోగా సాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం, ఆరో రోజు కలెక్షన్ల పరంగా భారీ క్షీణతను చూసింది. ట్రేడ్ వెబ్సైట్ సక్నిల్క్ గణాంకాల ప్రకారం, ఈ సినిమా తన ప్రారంభ జోష్ను నిలబెట్టుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఇండియాలో ఈ మూవీ మార్చి 24న కేవలం రూ.1.75 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించినట్లు సక్నిల్క్ తెలిపింది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాకు ఇలాంటి కలెక్షన్లు ఊహించనిదే.
థియేటర్లలో కేవలం 19.0% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. అంటే ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గిపోయిందని అర్థం. ప్రస్తుతం ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ.64.60 కోట్లుగా ఉన్నాయి, ఇది బడ్జెట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.