భారతదేశం, ఏప్రిల్ 8 -- ఇరాన్​కు ఇచ్చిన 'డెడ్​లైన్​' సమీపించిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారీ ప్రకటన చేశారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించిన దౌత్య ప్రయత్నాల తర్వాత, ఇరాన్‌పై అమెరికా దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బదులుగా ఇరాన్​ హార్ముజ్​ జలసంధిని పూర్తిగా తెరుస్తుందని వివరించారు.

48 గంటల్లో హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాలపై దాడులు చేసి, ఆ దేశంలో విధ్వంసం సృష్టిస్తామని ట్రంప్ గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.

'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ స్పందిస్తూ.. "పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లతో నేను జరిపిన సంభాషణల ఆధారంగా, ఈ రాత్రి ఇరాన్‌కు పంపాల్సిన వినాశకరమైన బలగాలను నిలిపివేయాలని వారు ...