UPSC prelims 2026 result : యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల- మెయిన్స్కు 13,343 మంది అర్హత
భారతదేశం, జూన్ 16 -- సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్-2026 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అధికారికంగా విడుదల చేసింది. ఈ ఏడాది మే 24వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో ప్రతిభ చాటి, తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు మొత్తం 13,343 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మెయిన్స్కు ఎంపికైన వారి సంఖ్య స్వల్పంగా తగ్గింది! 2025 సివిల్స్ నోటిఫికేషన్లోని 1,087 పోస్టుల భర్తీకి గానూ గతంలో 14,161 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు షార్ట్లిస్ట్ అయ్యారు.
భారత పరిపాలనా సేవ (ఐఏఎస్), భారత విదేశాంగ సేవ (ఐఎఫ్ఎస్), భారత పోలీసు సేవ (ఐపీఎస్)లతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ గ్రూప్-ఏ, గ్రూప్-బీ ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ ప్రతి ఏటా ఈ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తుంది. మొదటి దశ ప్రిలిమ్స్ కాగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.