భారతదేశం, మే 16 -- Fake IPL Ticket Apps : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 22న జరగనున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య మ్యాచ్‌కు నగరంలో విపరీతమైన క్రేజ్ నెలకొంది. విరాట్ కోహ్లీ, ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ క్రికెటర్ల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. అయితే.. టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న ఈ విపరీతమైన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని సొమ్ముచేసుకోవడానికి సైబర్‌ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా టికెట్ల దోపిడీకి తెరలేపారు.

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ఆకర్షణీయమైన ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ అధికారిక టికెటింగ్‌ భాగస్వామి అయిన 'డిస్ట్రిక్ట్‌' (District) యాప్‌ను పోలిన రంగులు, లోగోలతోనే ఈ నకిలీ యాప్‌లను,...