భారతదేశం, సెప్టెంబర్ 15 -- భారత్‌లో విస్తృతంగా ఉపయోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ వినియోగదారులకు కేంద్రం నుంచి బిగ్ న్యూస్ వచ్చింది. చిన్న తరహా చెల్లింపులు, వ్యక్తిగత నగదు బదిలీలపై ఎలాంటి రుసుములు విధించబోమని స్పష్టం చేసింది. అయితే వ్యాపారులకు(Merchants) సంబంధించి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన పెద్ద లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) రుసుమును విధించే అంశంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్ణయం తీసుకుంది.

వ్యాపారులకు వ్యక్తులు రూ.2000 కంటే ఎక్కువ యూపీఐ పేమెంట్స్‌ చేస్తే.. ఆ చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ వర్తిస్తుందని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. అంటే రూ.2000 లోపు పేమెంట్స్ ఎండీఆర్ పరిధిలోకి రావు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ సెప్టెంబర్ 14న విడుదల చేసిన గెజిట్ నో...