భారతదేశం, మార్చి 19 -- ఏప్రిల్ నెల సమీపిస్తోంది. ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకులు ఏటీఎం లావాదేవీల నిబంధనలలో గణనీయమైన మార్పులను అమలు చేస్తున్నాయి. ఇది మీ ఉచిత లావాదేవీ పరిమితి, నగదు ఉపసంహరణ ఛార్జీలపై నేరుగా ప్రభావం చూపుతుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పీఎన్‌బీ వంటి బ్యాంకులు కొత్త నిబంధనలను ప్రకటించాయి. ఈ నిబంధనల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ఉపయోగించి ఏటీఎంల నుండి చేసే నగదు ఉపసంహరణలు కూడా మీ ఉచిత లావాదేవీ పరిమితిలో భాగంగా పరిగణిస్తారు. అంటే మీ ఫ్రీ లిమిట్‌లో ఈ యూపీఐ ఉపయోగించి చేసే సర్వీస్ కూడా కౌంట్ అవుతుంది.

వాస్తవానికి ఏప్రిల్ 1వ తేదీ నుండి యూపీఐ ఉపయోగించి ఏటీఎంల నుండి చేసే నగదు ఉపసంహరణలు కూడా మీ ఉచిత లావాదేవీ పరిమితిలో భాగంగానే పరిగణిస్తారు. మీరు పరిమితిని మించి లావాదేవీలు జరిపితే.. మీకు అదనపు ఛార్జీలు విధిస్తారు.

యూపీఐ ...