భారతదేశం, సెప్టెంబర్ 12 -- Upasana Konidela: ఉపాసన కొణిదెల పేరు మరోసారి ట్రెండింగ్ గా మారింది. ఆమె అస్సాంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం గువాహటి కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించారు. రెడ్ కలర్ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఉపాసన.. అమ్మవారికి పూలబుట్టలను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆమె ఫొటోలు వైరల్ గా మారాయి.

ఈ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. "అమ్మ కామాఖ్య మనలోని దైవత్వాన్ని వెలికితీసి, రాక్షసత్వాన్ని అంతమొందించాలి. న్యూ బిగినింగ్స్.. డివైన్ శక్తి ధర్మ సేవ కర్మ" అంటూ పెట్టిన క్యాప్షన్ మెగా అభిమానులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. అయితే ఈ 'కొత్త ప్రారంభం' దేనికి సంబంధించినదనే వివరాలను ఆమె స్పష్టంగా వెల్లడించలేదు.

మెగా కుటుంబంలో ఏ చిన్న ఆధ్యాత్మిక సంఘటన జరిగినా లేదా సోషల్ మీడియా...