భారతదేశం, మార్చి 19 -- విశ్వావసునామ సంవత్సరం పూర్తయిపోయి, పరాభవ సంవత్సరం వచ్చింది. ఈ ఏడాది కుంభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి ఎలాంటి మార్పులు వస్తాయి? పూర్తి వివరాలతో చూసేద్దాం.

గురువు జూన్ నుంచి ఆరవ స్థానంలో, శని రెండవ స్థానంలో, రాహువు డిసెంబర్ దాకా ఒకటవ స్థానంలో, కేతువు డిసెంబర్ దాకా ఏడవ స్థానంలో సంచరించడం వలన ఈ రాశి వారు మధ్యస్థ నుంచి చెడు ఫలితాలను చూస్తారు. ఏలినాటి శని అంత్య భాగంలో ఉంది. కుంభ రాశి వారికి ఈ ఏడాది చికాకులు, రాజకీయ ఒత్తులు, మనస్పర్థలు వంటివి ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో ఇబ్బందులు వస్తాయి.

ఉద్యోగంలో చేరిన వారు మొదటి ఆరు నెలలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మార్పు వస్తుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ రుణ బాధలు మిమ్మల్ని బాధ పెడతాయి. అప్పులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ...