భారతదేశం, ఫిబ్రవరి 24 -- చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది. తెలుగు వారి నూతన సంవత్సరం (Ugadi 2026) ప్రారంభమవుతుంది. వసంత ఋతువు ప్రారంభంలో ఉగాది పండుగను జరుపుకుంటాము. ఆ రోజు ఆరు రుచులతో కూడిన షడ్రుచుల పచ్చడిని చేసుకుంటాము. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 19న వచ్చింది. ఈసారి వచ్చే తెలుగు నామ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం.

బ్రహ్మ ఉగాది నాడు సృష్టిని ప్రారంభించాడని, వసంత ఋతువు ప్రారంభమవుతుందని అంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి, ఉగాది నాడు కొత్త బట్టలు కట్టుకొని, పూజలు చేసి, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. అలాగే ఉగాది నాడు పంచాంగ శ్రవణం వింటారు. రాబోయే ఏడాది ఆదాయం, వ్యయం, రాశి ఫలాల గురించి తెలుసుకుంటారు.

మనము ఋతువులను బట్టి పండుగలను జరుపుకుంటాము. ఉగాది కూడా ఋతువు ఆధారంగా జరిపే పండుగ. శిశిర ఋతువు నుంచి వసంత ఋతువులోకి అడుగుపెట్టే నాడు ఉగాది పండుగను జరు...