భారతదేశం, మార్చి 13 -- కొత్త సంవత్సరం ఉగాది (Ugadi 2026) నుంచి ప్రారంభమవుతుంది. ఈసారి వచ్చే కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభం ఉగాది నుంచి జరుగుతుంది. ఉగాది నుంచి ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తాయి. ప్రకృతిలో కొత్త చిగుర్లు తొడుగుతాయి. అలాగే కొత్త ఆశలు కూడా చిగురుస్తాయి. ఉగాది ఆనందం, శ్రేయస్సు, కొత్త ప్రారంభాలకు సంకేతం.

ఇంత విశేషమైన రోజున ఖచ్చితంగా కొన్ని మంత్రాలు చదివేటట్టు చూసుకోండి. ఈ మంత్రాలను చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని శుభకార్యాలను మొదలుపెట్టడం వలన ఏడాది మొత్తం సానుకూల మార్పులను చూస్తారు. ఉగాది నాడు పఠించాల్సిన మంత్రాలు, ఆచరించాల్సిన పద్ధతుల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం.

ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం మంచిదని మనకు తెలిసిందే. పంచాంగ శ్రవణం చేసేటప్పుడు సంవత్సరానికి సంబంధి...