భారతదేశం, ఆగస్టు 4 -- తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా తీవ్ర దుమారంతో వేడెక్కింది. కావేరి జలాల వివాదంపై అధికార పక్షాన్ని విమర్శించే క్రమంలో ప్రతిపక్ష నేత, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనానికి దారితీశాయి. ప్రముఖ సినీ నటి త్రిషను, ముఖ్యమంత్రి విజయ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన డబుల్ మీనింగ్ కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యవహారంలో ఉదయనిధిపై కేసు నమోదు కాగా, తమిళనాడు పోలీసులు ఆయన్ని మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తనను తీసుకెళ్తున్న సమయంలో ఉదయనిధి స్పందిస్తూ.. "నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. నేను విజయ్ పేరు తప్ప వేరే ఎవరి పేరూ ఎత్తలేదు. కావాలనే నాపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటాను," అని పేర్కొన్నారు.

కావేరి నీటి విడుదల విషయంలో తమిళనాడు ముఖ్య...