భారతదేశం, సెప్టెంబర్ 10 -- Udayabhanu OTT: తెలుగు బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో సుదీర్ఘ కాలం అలరించిన ప్రముఖ నటి ఉదయభాను నిర్మించిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్ 'పంచనామా' (Panchanama). ఉదయభాను ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ మోస్ట్ అవైటెడ్ సిరీస్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ కానుంది.

క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'పంచనామా' సిరీస్ ప్రివ్యూ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్లో మాట్లాడుతూ సిరీస్ ప్రొడ్యూసర్ ఉదయభాను ఎమోషనల్ అయ్యారు. ''ఎమోషనల్ కాకూడదు అనుకున్నా. కానీ కన్నీళ్లు వస్తున్నాయి. ప్రొడక్షన్ లాంఛ్ చేయాలని 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా. టెలివిజన్ లోనే పుట్టా. నాకు ఎటువంటి రోడ్ మ్యాప్ లేదు'' అని ఉదయభాను చెప్పారు.

''నాకు ఎటువంటి రోడ్ మ్యాప్ లేదు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లేదు. స్టూడియోల ఓనర్లు లేరు. పెద్...