భారతదేశం, మార్చి 10 -- తెలుగులో యాంకర్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఉదయభాను చాలా కాలం తర్వాత వరుసగా సినీ ప్రాజెక్ట్స్‌తో బిజీ అవుతున్నారు. త్రిబాణధారి బార్బరిక్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన ఉదయభాను రీసెంట్‌గా తెలుగు ఓటీటీ సిరీస్‌తో డిజిటల్ వేదికపై అలరించారు.

ఉదయ భాను నటించిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. ఉదయ భానుతోపాటు రాజీవ్ కనకాల, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఓటీటీ సిరీస్‌కు కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు.

ఫిబ్రవరి 27 నుంచి జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. ఈ క్రమంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ స...