భారతదేశం, జూన్ 5 -- TTD Srivari Vaidya Seva : కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన, నాణ్యమైన ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సరికొత్త అడుగు వేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ అనుబంధ ఆసుపత్రుల్లో "శ్రీవారి వైద్య సేవ" అనే వినూత్న కార్యక్రమాన్ని శుక్రవారం నాడు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా వైద్యులు తమ పేర్లను సులభంగా నమోదు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్‌ను టీటీడీ ఈవో రవిచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, నగరాల్లో ఉన్న ప్రముఖ వైద్య నిపుణుల సేవలను తిరుమల, తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ...