భారతదేశం, ఫిబ్రవరి 28 -- టీటీడీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది.

తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ర‌విచంద్ర‌తో కలిసి టీటీడీ ఛైర్మన్ శ‌నివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బడ్దెట్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. టీటీడీ విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన‌ విద్యను అందించేందుకు గాను రూ.118.89 కోట్లు కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. డిజిటల్ క్లాస్ రూములు, అదనపు హాస్టల్ బ్లాకులు, వంట గదుల ఆధునీకరణ, ఇత‌ర మౌళిక స‌దుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేందుకు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొన్నారు.

భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీ‌వారికి ముడుపులు అందించే దాతల సౌకర్యార్థం "శ్రీవారి ముడుప...