భారతదేశం, జూలై 18 -- TTD Alipiri Path Safety : కాలిబాట మార్గంలో తిరుమల వెళ్లే భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి నడక మార్గంలో వన్యప్రాణుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం తిరుమల పద్మావతి విశ్రాంతి భవనంలోని 'సుధర్మ' సమావేశ మందిరంలో టీటీడీ, అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

గత కొన్నేళ్లుగా నడక మార్గంలో చోటుచేసుకున్న వన్యప్రాణుల దాడులు, ఆయా సమయాల్లో క్రూర జంతువుల ప్రవర్తన మరియు వాటి ధోరణులపై సేకరించిన సమగ్ర డేటాను విశ్లేషించాలని అదనపు ఈవో సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఒక శా...