భారతదేశం, జూలై 2 -- TTD Akshara Govindam 2026 : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల కోసం మరో ఆధ్యాత్మిక, సంప్రదాయబద్ధమైన విశేష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శ్రీ వకుళామాత సన్నిధిలో జూలై 3వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్న "అక్షర గోవిందం - అన్నప్రాశన" కార్యక్రమానికి అన్ని రకాల పటిష్ట ఏర్పాట్లు చేపడుతోంది.

బుధవారం రోజు(జులై 3) ఆలయ పరిసరాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జేఈవో డాక్టర్ ఎ. శరత్ పర్యవేక్షించారు. భక్తులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జేఈవో డాక్టర్ ఎ. శరత్ మాట్లాడుతూ.. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి అనుగ్రహం, అమ్మ శబరి అవతారమైన శ్రీ వకుళామాత కరుణాకటాక్షాల నడుమ వేదోక్తంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన సంస్కారాలు ని...