భారతదేశం, ఏప్రిల్ 15 -- భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవల కాలంలో తిరుమ‌ల‌లో ద‌ర్శనాలు, గ‌దులు ఇప్పిస్తామంటూ కొంద‌రు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో భ‌క్తుల‌ను నమ్మబలికి మోస‌గించి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టుగా తెలిపింది.

దీనిలో భాగంగా టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతో, పోలీసుల స‌మ‌న్వయంతో సోషయ‌ల్ మీడియాలో "శ్రావ‌ణ్ క‌ళ తిరుమ‌ల‌, తిరుప‌తి వెంకటేశ్వర స్వామి దేవ‌స్థానం" ఐడీతో భ‌క్తుల‌ను మోస‌గిస్తున్న చిత్తూరుజిల్లా పెనుమూరుకు చెందిన కామ‌సాని ప‌వ‌న్ కుమార్ అలియాస్ నాగ‌రాజు, బోడిరెడ్డి చెన్నకేశ‌వులు అనే వ్యక్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు.

ఇటీవ‌ల సోషల్ మీడియాలో భ‌క్తుల‌ను మోస‌గిస్తున్న ఉందంతాల దృష్ట్యా భ‌క్తు...