భారతదేశం, జూలై 19 -- శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు గదుల కోసం ఇబ్బంది పడకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. గతంలో సీఆర్వో వద్ద గదుల కోసం భక్తులు గంటల కొద్దీ వేచి ఉండే విధానాన్ని మార్పు చేస్తూ భక్తుల అవస్థలు, సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఉప విచారణ కార్యాలయాల ద్వారా గదులు కేటాయించే విధానాన్ని అమలు చేస్తోంది‌. భక్తులు ముందుగా తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం(సీఆర్వో) వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటల నుండి సీఆర్వో కార్యాలయం తెరుచుకుంటుంది. గదుల అందుబాటులో ఉన్నంత వరకు సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

భక్తులు క్యూలైన్‌లో నిలబడి తమ వంతు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద తమ ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా జిరాక్స్ కాపీని తీసుకెళ్లి ఫోన్ నెంబర్ వివరాలు తెలియజేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్ ...