భారతదేశం, ఏప్రిల్ 29 -- తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. అర్హులైన అభ్యర్థుల కోసం నిర్వహించే ఎస్ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 05.06.2026 నుంచి 12.06.2026 వరకు జరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షలు నిర్వహించడానికి అందుబాటులో ఉన్న సమయం పరిమితంగా ఉండటంతో రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ ఫలితాలను వేచి చూడకుండా దరఖాస్తు స్వీకరిస్తామని బోర్డు స్పష్టం చేసింది.

పదో తరగతి మార్చి 2026 పరీక్షల్లో ఫెయిల్ అయినవారు.. అలాగే 2015 సీసీఈ ప్యాటర్న్ నుంచి ఫెయిల్ అయినవారు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలనుకుంటే.. 30.04.2026 నుంచి నిర్ణిత గడువు ప్రకారం పరీక్ష ఫీజును చెల్లించాలని అధికారులు వెల్లడించారు.

అభ్యర్థులు పరీక్ష ఫీజను సంబంధిత పాఠశాల ప్రధానోపాద్యాయులకు ఆన్‌లైన్ ద్...