భారతదేశం, ఏప్రిల్ 12 -- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. 2026 ఇంటర్ సెకండియర్ జనరల్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 82.73 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జయశంకర్ భూపాలపల్లి (82.34%), కొమురం భీమ్ ఆసిఫాబాద్ (82.16 శాతం) నిలిచాయి. ములుగు జిల్లా 82.12 శాతంతో నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం.

అట్టడుగున ఉన్న జిల్లాలను గమనిస్తే

2026 ఫలితాల్లో జనరల్ స్ట్రీమ్ సెకండియర్‌లో మొత్తం 4,11,474 మంది విద్యార్థులు హాజరుకాగా, 3,11,112 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికల ఉత్తీర్ణత శాతం 81.78 కాగా, బాలురు 68.99 శాతంతో సరిపెట్టుకున్నారు. దాదాపు 12 శాతం వ్యత్యాసంతో బాలికలు ముందంజలో ఉన్నారు. ఇక ఫస్ట్ ఇయర్ విషయానికి వస్తే 4,41,864 మందికి గాను 2,95,780 మంది (66.94 శాతం) గట్టెక్కారు.

తమ మార్కులతో సంతృప్తి చెందని విద్య...