భారతదేశం, మార్చి 10 -- తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు, దర్శకుడిగా పేరున్న ఆర్. పార్థిబన్, హీరోయిన్ త్రిష కృష్ణన్ మధ్య మొదలైన 'మాటల యుద్ధం' కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ఒక అవార్డు వేడుకలో త్రిష గురించి పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి.

దీనిపై త్రిష కృష్ణన్ కూడా ఘాటుగా స్పందించడంతో, తాజాగా పార్థిబన్ దాదాపు ఎనిమిది నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేసి తన వివరణ ఇచ్చారు. అందులో త్రిషకు పార్థిబన్ క్షమాపణలు చెప్పారు.

ఆదివారం (మార్చి 8) జరిగిన ఒక కార్యక్రమంలో పార్థిబన్ మాట్లాడుతూ.. 'పొన్నియిన్ సెల్వన్'లో త్రిష పోషించిన కుందవై పాత్రను ప్రస్తావించారు. "ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే కూర్చోవాలి" అంటూ పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై త్రిష ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా త...